పవన్ కళ్యాణ్-రానా మూవీ షూటింగ్ ప్రారంభం
- January 25, 2021హైదరాబాద్:మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటుగా, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ నేడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఈ భారీ సెట్ లోనే సినిమా దాదాపుగా నెల రోజులు పాటు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్న ఇంతవరకు చిత్రయూనిట్ అధికారికంగా ఎవరి పేర్లను అనౌన్స్ చేయలేదు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి తెలుగులో ‘బిల్లా-రంగా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్