టీ20 ఆసీయా కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
- February 24, 2016
టీ20 ఆసీయా కప్ మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 45 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 166/6 పరుగులు చేసింది. భారత్ జట్టులో రోహిత్శర్మ 55 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆట చివరిలో హార్దిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్తో 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 167 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో బంగ్లాదేశ్ ఆరంభంలోనే తడబడి రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. దీంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా జట్టులో షబ్బీర్ రహమాన్ 32 బంతుల్లో 44 పరుగులు మినహ జట్టులో ఎవరు చెప్పుకోతగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 127/7 పరుగులు చేసి 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









