టీ20 ఆసీయా కప్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
- February 24, 2016
టీ20 ఆసీయా కప్ మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 45 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 166/6 పరుగులు చేసింది. భారత్ జట్టులో రోహిత్శర్మ 55 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆట చివరిలో హార్దిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్తో 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 167 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో బంగ్లాదేశ్ ఆరంభంలోనే తడబడి రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. దీంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా జట్టులో షబ్బీర్ రహమాన్ 32 బంతుల్లో 44 పరుగులు మినహ జట్టులో ఎవరు చెప్పుకోతగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 127/7 పరుగులు చేసి 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







