2021 బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- February 01, 2021
న్యూ ఢిల్లీ:2021 బడ్జెట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. 2021 బడ్జెట్పై భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. కరోనా తరువాత వస్తున్న బడ్జెట్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆత్మనిర్భర్ పేరుతో కార్పొరేట్ రంగానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు.ఈ బడ్జెట్లో అయినా ఊరటనిస్తారా లేదా అని సామాన్యులు ఎదురుచూస్తున్నారు.కరోనా కారణంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగింది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నారు. మరోవైపు, ఆదాయపన్ను మినహాయింపులు పెంచాలని వేతనజీవులు కోరుతున్నారు. కరోనా సృష్టించిన భయాల కారణంగా.. అందరికీ వైద్య సేవలు, ఆరోగ్య బీమా తప్పనిసరిగా కనిపిస్తోంది. తక్కువ ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములు ప్రకటించాలని, అందరికీ వైద్యం అందేలా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







