లంకతో యు.ఏ.ఈ పోరు
- February 25, 2016
శ్రీలంకతో ఆసియాకప్లో భాగంగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో యూఏఈ విజయానికి 61 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. 130 పరుగుల ఛేదనకు దిగిన యూఏఈ జట్టును శ్రీలంక పేసర్లు మలింగ, కులశేఖర ఆదిలోనే వరుసగా వికెట్లు తీసి దెబ్బతీశారు. దీంతో ఆ జట్టు 9.5 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. మీర్పూర్: శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి యూఏఈకి షాకిచ్చాడు. ఆసియా కప్లో భాగంగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో 130 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ముస్తఫా వికెట్ కోల్పోయింది. ఆ ఓవర్లోనే చివరి బంతికి మహ్మద్ సెహజాద్(1)ను మలింగ పెవిలియన్కు పంపడంతో ఆ జట్టు ఒక ఓవర్ ముగిసే సమయానికే 7/2తో ఆత్మరక్షణలో పడిపోయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







