లంకతో యు.ఏ.ఈ పోరు

- February 25, 2016 , by Maagulf
లంకతో యు.ఏ.ఈ పోరు

శ్రీలంకతో ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో యూఏఈ విజయానికి 61 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. 130 పరుగుల ఛేదనకు దిగిన యూఏఈ జట్టును శ్రీలంక పేసర్లు మలింగ, కులశేఖర ఆదిలోనే వరుసగా వికెట్లు తీసి దెబ్బతీశారు. దీంతో ఆ జట్టు 9.5 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేయగలిగింది. మీర్పూర్‌: శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ్‌ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి యూఏఈకి షాకిచ్చాడు. ఆసియా కప్‌లో భాగంగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో 130 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ ముస్తఫా వికెట్‌ కోల్పోయింది. ఆ ఓవర్‌లోనే చివరి బంతికి మహ్మద్‌ సెహజాద్‌(1)ను మలింగ పెవిలియన్‌కు పంపడంతో ఆ జట్టు ఒక ఓవర్‌ ముగిసే సమయానికే 7/2తో ఆత్మరక్షణలో పడిపోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com