ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

- February 12, 2021 , by Maagulf
ఏ.పీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి... ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30,620 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 68 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి, ఒకరు మృతి చెందగా.. ఇదే సమయంలో 106 మంది రికవరీ అయ్యారు.దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,88,760కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,80,784కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,162 మంది మృతిచెందారు.ప్రస్తుతం రాష్ట్రంలో 814 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com