అరకు ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం...
- February 12, 2021అరకు:విశాఖపట్నం జిల్లా అరకు ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన టూరిస్ట్ బస్సు... లోయలోకి దూసుకెళ్లింది.. అనంతగిరి మండలం డముకలోని ఐదో నంబర్ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.అరకు వెళ్లిన పర్యాటకులు... తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇది హైదరాబాద్కు చెందిన టూరిస్టుల బస్సుగా చెబుతున్నారు.. స్థానికుల సమాచారంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు...
క్షతగాత్రులను 108 సహాయంతో ఎస్.కోట ఆస్పత్రికి తరలిస్తున్నారు.అయితే, ప్రమాద సమయంలో 30 మంది పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. 8 మంది మృతిచెందగా... 20 మందికిపైగా తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదాన్ని చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మొత్తంగా మృతులంతా హైదరాబాద్కు చెందినవారిగానే చెబుతున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు