100 స్టేషన్లలో వైఫై....

- February 25, 2016 , by Maagulf
100 స్టేషన్లలో వైఫై....

గూగుల్ సహకారంతోనే.. వచ్చే రెండేళ్లలో 400 స్టేషన్లలో ఏర్పాటు న్యూఢిల్లీ: ఈ ఏడాది 100 స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. అలాగే వచ్చే రెండేళ్లలో 400 రైల్వేస్టేషన్లలో ఈ సదుపాయాన్ని కల్పి స్తామన్నారు. గూగుల్‌తో కలసి భారత రైల్వే.. వైఫై సదుపాయాన్ని కల్పించడానికి అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు పేర్కొన్నారు.గత డిసెంబర్‌లో భారత్‌కు వచ్చిన గూగు ల్ సీఈవో సుందర్ పిచాయ్.. ప్రతి ఒక్కరికీ ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పించడానికి రైల్వే సహకారంతో 400 స్టేషన్లలో వైఫై కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయం తెలిసిందే.ఈ ఏడాదే ట్రాక్ మేనేజ్‌మెంట్ సిస్టం అప్లికేషన్‌ను కూడా ప్రారంభించనున్నట్టు ప్రభు వెల్లడించారు. దీనిద్వారా ట్రాక్‌ల తనిఖీలు, పర్యవేక్షణపై నిరంతరాయంగా నిఘా ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com