భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 18, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.అయితే, ముంబై, కేరళ రాష్ట్రాల్లో కేసులు తిరిగి పెరుగుతున్నాయి.దీంతో ఆయా రాష్ట్రాలు కరోనాపై తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.నిబంధనలు గాలికి వదిలేయడం వలనే కేసులు పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 12,881 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,50,201కి చేరింది.ఇందులో 10,06,56,845 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,37,342 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 101 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,56,014కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్ లో 11,987 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.చాలా కాలం తరువాత డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







