భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 18, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.అయితే, ముంబై, కేరళ రాష్ట్రాల్లో కేసులు తిరిగి పెరుగుతున్నాయి.దీంతో ఆయా రాష్ట్రాలు కరోనాపై తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.నిబంధనలు గాలికి వదిలేయడం వలనే కేసులు పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 12,881 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,50,201కి చేరింది.ఇందులో 10,06,56,845 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,37,342 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 101 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,56,014కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్ లో 11,987 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.చాలా కాలం తరువాత డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com