మస్కట్:అనుకున్నదాని కంటే తక్కువ మొత్తంలో కరెంట్ బిల్లులు
- February 18, 2021
మస్కట్:సబ్సిడీలు ఎత్తివేసి కొత్త టారీఫ్ లను అమలు చేయటంతో కరెంట్ బిల్లు పేలిపోతుందని ఆందోళన పడిన వినియోగదారుల అంచనాలు తలకిందులయ్యాయి. ముందస్తుగా అనుకున్న దాని కంటే తక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లులు వచ్చాయి. ప్రభుత్వ రాబడిని పెంచే సంస్కరణ చర్యల్లో భాగంగా విద్యుత్, నీటి సరఫరాపై అందిస్తున్న సబ్సిడీలను ఒమన్ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచే కొత్త టారిఫ్ రేట్లను కూడా అమల్లోకి తెచ్చింది. అథారిటీ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ రెగ్యులేషన్ ప్రకారం, జాతీయ రాయితీలు పొందే పౌరులకు 2000 kWh / h కి 15 Bz గా విద్యుత్ పన్నును నిర్ధారించింది. అలాగే 4000 kWh కంటే ఎక్కువ వినియోగానికి 30 Bzగా పన్ను రేటును నిర్ణయించింది. అయితే..జనవరిలో జారీ అయిన బిల్లులలో 2000 kWh కు 10 Bz, 4000 kWh కంటే ఎక్కువ వినియోగానికి 20 Bz గా బిల్లులు వచ్చాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం