మోడీ ప్రపోసల్ ను సపోర్ట్ చేసిన పాక్
- February 19, 2021
భవిష్యత్తులో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని డాక్టర్లు మరో దేశానికి వెళ్లడానికి వారికోసం ప్రత్యేక వీసాలను రూపొందించాలని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు పాకిస్తాన్ స్వాగతించింది.
కొవిడ్-19తో వచ్చిన సమస్యలను, అనుభవాన్ని, వ్యాధి సంబంధిత అంశాల్ని చర్చించడానికి భారత్..సార్క్తో పాటు మారిషస్, సీశెల్స్ దేశాల నిపుణులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మాట్లాడిన మోడీ.. కొవిడ్-19 వాక్సిన్ సమాచారాన్ని పంచుకొని, టీకాను మరింత మెరుగ్గా మన దేశాల ప్రజలకు ఇవ్వడానికి ప్రాంతీయ కార్యచరణను రూపొందించుకోలేమా? వ్యాధిసంబంధిత సాంకేతికత సాయంతో భవిష్యత్తులో మహమ్మారులు రాకుండా చూసేందుకు ప్రాంతీయ కార్యచరణనను ఏర్పరచుకోలేమా? భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశాలు పరస్పర సహకారంతో, ప్రత్యేక కార్యచరణను రూపొందించుకోవాలి.
ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒక దేశంలోని వైద్యులు మరో దేశానికి వెంటనే వెళ్లడానికి వీలుగా వారికోసం ప్రత్యేక వీసాలు తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న దేశాలను ప్రధాని కోరారు. అంతేకాకుండా దేశాల విదేశాంగ మంత్రులు చర్చించుకుని ఎయిర్ అంబులెన్స్లకు సంబంధించి వైద్యసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మోడీ సూచించారు. అంతేకాకుండా దేశాల మధ్య ఆరోగ్య సంబంధిత పథకాల సమాచారాన్ని పంచుకోవాలని ప్రధాని కోరారు. మోడీ ఇచ్చిన ఐదు సూచనలకు పాకిస్తాన్ తో సహా పది దేశాలు మద్దతు పలికాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







