`స‌ర్కారువారి పాట‌` దుబాయ్ షెడ్యూల్ పూర్తి

- February 21, 2021 , by Maagulf
`స‌ర్కారువారి పాట‌` దుబాయ్ షెడ్యూల్ పూర్తి

దుబాయ్:సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 27వ చిత్రం `స‌ర్కారువారిపాట‌`.డైరెక్టర్  ప‌రశురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా గ‌త నెల రోజులుగా దుబాయ్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.ఈ షెడ్యూల్ ఆదివారంతో పూర్త‌య్యింది. త‌దుప‌రి షెడ్యూల్ గోవాలో జ‌ర‌గుతుందని స‌మాచారం.

కాగా..దుబాయ్ షెడ్యూల్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాలు, మ‌హేశ్, కీర్తిసురేష్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించింది చిత్ర యూనిట్‌. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com