పేదలకు ఉచితంగా ఇసుక!

- February 26, 2016 , by Maagulf
పేదలకు ఉచితంగా ఇసుక!

 పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని సూత్రపాయంగా నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు తెలిపారు. ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇసుకలో ఆదాయం కంటే ప్రభుత్వానికి చెడ్డపేరు ఎక్కువగా వస్తోందని సీఎం అభిప్రాయడినట్లు మంత్రులు చెప్పారు. రూ.200 కోట్ల ఆదాయం కోసం ఇదంతా అవసరమా? అని సీఎం ప్రశ్నించారన్నారు. నిబంధనలు లేకుండా అవసరమైన వారికి ఉచితంగా ఇసుక ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పేదలకు మరొక సంక్షేమ పథకమేనని మంత్రులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com