లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం

- February 26, 2016 , by Maagulf
లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం

అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి హాజరుకానున్నారు. లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 999 మంది కళాకారులతో శోభాయాత్రను నిర్వహించనున్నారు. లేపాక్షి ఉత్సవ ఏర్పాట్లను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాలకు హాజరుకావాలంటూ నందమూరి బాలకృష్ణ న్యూఢిల్లీలోని పలువురు కేంద్రమంత్రులను కలసి స్వయంగా ఆహ్వాన పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం రూ.4.20 కోట్ల నిధులు కేటాయించిన విషయం విదితమే. లేపాక్షి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com