నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, ఖతార్ కంపెనీకి ఫైన్
- May 30, 2015
ఖతార్ న్యాయస్థానం, ఓ కార్మికుడి మృతి పట్ల సీరియస్గా స్పందించింది. నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే క్రేన్ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. క్రేన్ ఆపరేటర్, కన్స్ట్రక్షన్ కంపెనీకి వెయ్యి రియాల్స్ ఫైన్ విధించడంతోపాటు, బాధితుడికి ఆర్థిక సహాయం అందించాలని తీర్పునిచ్చింది. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆ నిర్మాణ సంస్థకూ ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. పాత విమానాశ్రయం దగ్గర్లోగల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో జనవరి 5వ తేదీన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.డామన్ సంస్థ ఈ నిర్మాణం చేపడ్తోంది. ఏడు వందల కిలోల బరువున్న పైప్లను పైకి లేపే ప్రయత్నంలో, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు విచారణలో తేలింది.
----వనంబత్తిన రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









