నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, ఖతార్ కంపెనీకి ఫైన్
- May 30, 2015
ఖతార్ న్యాయస్థానం, ఓ కార్మికుడి మృతి పట్ల సీరియస్గా స్పందించింది. నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే క్రేన్ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. క్రేన్ ఆపరేటర్, కన్స్ట్రక్షన్ కంపెనీకి వెయ్యి రియాల్స్ ఫైన్ విధించడంతోపాటు, బాధితుడికి ఆర్థిక సహాయం అందించాలని తీర్పునిచ్చింది. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆ నిర్మాణ సంస్థకూ ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. పాత విమానాశ్రయం దగ్గర్లోగల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో జనవరి 5వ తేదీన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.డామన్ సంస్థ ఈ నిర్మాణం చేపడ్తోంది. ఏడు వందల కిలోల బరువున్న పైప్లను పైకి లేపే ప్రయత్నంలో, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు విచారణలో తేలింది.
----వనంబత్తిన రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







