సౌదీలో టెర్రర్ ఎటాక్ని ఖండించిన యూఏఈ

- May 29, 2015 , by Maagulf
సౌదీలో టెర్రర్ ఎటాక్ని ఖండించిన  యూఏఈ

సౌదీ అరేబియన్‌ నగరం దమ్మామ్‌లో శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా తీవ్రవాదులు జరిపిన దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణించడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది.జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా, మత సామరస్యాన్ని పాడు చేసేందుకోసం హేయమైన చర్యలకు తీవ్రవాదులు వెనుకాడడంలేదనీ, అలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని యూఏఏఈ ఫారిన్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ మహమ్మద్‌ గర్గాష్‌ అన్నారు.తీవ్రవాదంపై ఉమ్మడి పోరు జరపాల్సి ఉందనీ, ఏ రూపంలో తీవ్రవాదం ఉన్నా అణచివేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు యూఏఈ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు డాక్టర్‌ గర్గాష్‌.సౌదీ ప్రజలకు ఇకపై ఎలాంటి కష్టం కలగరాదని ‘అల్లా’ని ప్రార్థించామని ఆయన చెప్పారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com