కువైట్లోని భారత ఎంబసీ సేవలు మార్చి 11 వరకు నిలిపివేత

- March 04, 2021 , by Maagulf
కువైట్లోని భారత ఎంబసీ సేవలు మార్చి 11 వరకు నిలిపివేత

కువైట్ సిటీ:కువైట్లోని భారత ఎంబసీలో సాధారణ సేవలను మార్చి 11 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ముందస్తు ఎంబసీ కార్యాలయం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 3, 4వ తేదీల్లో సాధారణ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత సేవల నిలిపివేతను మరికొన్నాళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. దీంతో మార్చి 11 వరకు ఎంబసీలో సాధారణ సేవలు అందుబాటులో ఉండవు. అప్పటివరకు ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే..డెత్ కేస్ రిజిస్ట్రేషన్స్, ఐసీడబ్ల్యూఏఫ్ అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com