మళ్లీ దుబాయ్కి రానున్న మహేష్..
- March 08, 2021
హైదరాబాద్:సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా విడుదల చేసి ఏడాది అవుతుంది. ప్రస్తుతం మహేష్ తాజాగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు.ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం వరకు దుబాయ్లో జరిగింది. అక్కడ రెండు షెడ్యూల్స్ను పూర్తి చేసుకొని మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చారు.సినిమాలో మరో షెడ్యూల్ను యూఎస్లో చిత్రించాలని అనుకున్నారంట.కానీ కొన్ని కారణాల కారణంగా ఆ ప్లాన్ కాస్త మారి పోయిన సర్కారు వారి పాట టీమ్ మళ్లీ దుబాయ్కు బయలు దెరనున్నారు.ఈనెల 22న మూవీ టీం దుబాయ్కు బయలు దెరనుంది. అక్కడ ఏప్రిల్ 15 వరకు చిత్రీకరణ కొనసాగించనున్నారు.ఈ షెడ్యూల్లో కీర్తీ సురేస్ సహా కీలక నటులు పాల్గొననున్నారు.ఇదిలా ఉంటే ఈ చిత్రం బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







