తెలంగాణలో పొలిటికల్ హీట్...
- March 19, 2021హైదరాబాద్:తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ వెలుస్తుందా అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు.వైఎస్ కూతురిగా,ఏపి సీఎం జగన్ సోదరిగా అందరికి సుపరిచితురాలైన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది.తెలంగాణలోని జిల్లాల నేతలతో షర్మిల సంప్రదింపులు జరుపుతున్నారు.రాజన్న రాజ్యం కోసం రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.జిల్లాల నేతలతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా వైఎస్ షర్మిలను కలుస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు,టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా ఈరోజు వైఎస్ షర్మిలను కలిశారు.ఈ ఇద్దరు వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.అయితే, మర్యాదపూర్వకంగానే వైఎస్ షర్మిలను కలిసినట్టు మహ్మద్ అసుదుద్దీన్,ఆనం మీర్జాలు పేర్కొన్నారు.ఒకవేళ ఈ ఇద్దరు షర్మిల పార్టీలో చేరితే, మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా షర్మిల పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్