ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- January 11, 2026
మస్కట్: ఒమన్లోని ఒక కోర్టు అల్లర్లు, విధ్వంసం, రెచ్చగొట్టడం మరియు ప్రజా శాంతికి హాని కలిగించే విషయాలను ప్రచారం చేసిన ఆరోపణలపై 59 మంది ప్రవాసులను దోషులుగా నిర్ధారించి, వారికి జైలు శిక్ష, శాశ్వత బహిష్కరణ మరియు వారి మొబైల్ ఫోన్లను జప్తు చేయాలని తీర్పు ఇచ్చింది. బిద్బిద్ విలాయత్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు జనవరి 8న ఈ తీర్పును వెలువరించింది.
నిందితులు రెచ్చగొట్టడంతోపాటు చట్టవిరుద్ధంగా సమావేశంలో పాల్గొన్నారని, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, ప్రజా శాంతికి భంగం కలిగించే కంటెంట్ను సృష్టించారని.. సమాచార సాంకేతికతను ఉపయోగించడం వంటి అనేక నేరాలకు పాల్పడినట్లు దోషులుగా తేల్చింది కోర్టు. మరో 23 మంది నిర్దోషులుగా పేర్కొని విడుదల చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసు డిసెంబర్ 25 సాయంత్రం చోటుచేసుకుంది. ఆ రోజు బిద్బిద్ విలాయత్లోని సా'అల్ ప్రాంతంలో ఒక కంపెనీకి చెందిన నివాస సముదాయం సమీపంలో విధ్వంసం మరియు రెచ్చగొట్టే చర్యలతో ఒక గుంపు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కార్మికుల పెద్ద గుంపు కంపెనీ సౌకర్యాలు మరియు ఆస్తులపై విధ్వంసక చర్యలకు పాల్పడటాన్ని, అలాగే కంపెనీ బస్సులను ధ్వంసం చేయడాన్ని అడ్డుకుని, వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









