ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- January 11, 2026
మస్కట్: ఒమన్లోని ఒక కోర్టు అల్లర్లు, విధ్వంసం, రెచ్చగొట్టడం మరియు ప్రజా శాంతికి హాని కలిగించే విషయాలను ప్రచారం చేసిన ఆరోపణలపై 59 మంది ప్రవాసులను దోషులుగా నిర్ధారించి, వారికి జైలు శిక్ష, శాశ్వత బహిష్కరణ మరియు వారి మొబైల్ ఫోన్లను జప్తు చేయాలని తీర్పు ఇచ్చింది. బిద్బిద్ విలాయత్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు జనవరి 8న ఈ తీర్పును వెలువరించింది.
నిందితులు రెచ్చగొట్టడంతోపాటు చట్టవిరుద్ధంగా సమావేశంలో పాల్గొన్నారని, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, ప్రజా శాంతికి భంగం కలిగించే కంటెంట్ను సృష్టించారని.. సమాచార సాంకేతికతను ఉపయోగించడం వంటి అనేక నేరాలకు పాల్పడినట్లు దోషులుగా తేల్చింది కోర్టు. మరో 23 మంది నిర్దోషులుగా పేర్కొని విడుదల చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసు డిసెంబర్ 25 సాయంత్రం చోటుచేసుకుంది. ఆ రోజు బిద్బిద్ విలాయత్లోని సా'అల్ ప్రాంతంలో ఒక కంపెనీకి చెందిన నివాస సముదాయం సమీపంలో విధ్వంసం మరియు రెచ్చగొట్టే చర్యలతో ఒక గుంపు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కార్మికుల పెద్ద గుంపు కంపెనీ సౌకర్యాలు మరియు ఆస్తులపై విధ్వంసక చర్యలకు పాల్పడటాన్ని, అలాగే కంపెనీ బస్సులను ధ్వంసం చేయడాన్ని అడ్డుకుని, వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!









