ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- January 11, 2026
మస్కట్: ఒమన్లోని ఒక కోర్టు అల్లర్లు, విధ్వంసం, రెచ్చగొట్టడం మరియు ప్రజా శాంతికి హాని కలిగించే విషయాలను ప్రచారం చేసిన ఆరోపణలపై 59 మంది ప్రవాసులను దోషులుగా నిర్ధారించి, వారికి జైలు శిక్ష, శాశ్వత బహిష్కరణ మరియు వారి మొబైల్ ఫోన్లను జప్తు చేయాలని తీర్పు ఇచ్చింది. బిద్బిద్ విలాయత్లోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు జనవరి 8న ఈ తీర్పును వెలువరించింది.
నిందితులు రెచ్చగొట్టడంతోపాటు చట్టవిరుద్ధంగా సమావేశంలో పాల్గొన్నారని, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని, ప్రజా శాంతికి భంగం కలిగించే కంటెంట్ను సృష్టించారని.. సమాచార సాంకేతికతను ఉపయోగించడం వంటి అనేక నేరాలకు పాల్పడినట్లు దోషులుగా తేల్చింది కోర్టు. మరో 23 మంది నిర్దోషులుగా పేర్కొని విడుదల చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసు డిసెంబర్ 25 సాయంత్రం చోటుచేసుకుంది. ఆ రోజు బిద్బిద్ విలాయత్లోని సా'అల్ ప్రాంతంలో ఒక కంపెనీకి చెందిన నివాస సముదాయం సమీపంలో విధ్వంసం మరియు రెచ్చగొట్టే చర్యలతో ఒక గుంపు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కార్మికుల పెద్ద గుంపు కంపెనీ సౌకర్యాలు మరియు ఆస్తులపై విధ్వంసక చర్యలకు పాల్పడటాన్ని, అలాగే కంపెనీ బస్సులను ధ్వంసం చేయడాన్ని అడ్డుకుని, వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!







