తెలంగాణలో పొలిటికల్ హీట్...
- March 19, 2021
హైదరాబాద్:తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ వెలుస్తుందా అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు.వైఎస్ కూతురిగా,ఏపి సీఎం జగన్ సోదరిగా అందరికి సుపరిచితురాలైన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది.తెలంగాణలోని జిల్లాల నేతలతో షర్మిల సంప్రదింపులు జరుపుతున్నారు.రాజన్న రాజ్యం కోసం రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.జిల్లాల నేతలతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా వైఎస్ షర్మిలను కలుస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు,టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా ఈరోజు వైఎస్ షర్మిలను కలిశారు.ఈ ఇద్దరు వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.అయితే, మర్యాదపూర్వకంగానే వైఎస్ షర్మిలను కలిసినట్టు మహ్మద్ అసుదుద్దీన్,ఆనం మీర్జాలు పేర్కొన్నారు.ఒకవేళ ఈ ఇద్దరు షర్మిల పార్టీలో చేరితే, మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా షర్మిల పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









