తెలంగాణలో పొలిటికల్ హీట్...
- March 19, 2021
హైదరాబాద్:తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ వెలుస్తుందా అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు.వైఎస్ కూతురిగా,ఏపి సీఎం జగన్ సోదరిగా అందరికి సుపరిచితురాలైన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది.తెలంగాణలోని జిల్లాల నేతలతో షర్మిల సంప్రదింపులు జరుపుతున్నారు.రాజన్న రాజ్యం కోసం రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.జిల్లాల నేతలతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా వైఎస్ షర్మిలను కలుస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు,టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా ఈరోజు వైఎస్ షర్మిలను కలిశారు.ఈ ఇద్దరు వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.అయితే, మర్యాదపూర్వకంగానే వైఎస్ షర్మిలను కలిసినట్టు మహ్మద్ అసుదుద్దీన్,ఆనం మీర్జాలు పేర్కొన్నారు.ఒకవేళ ఈ ఇద్దరు షర్మిల పార్టీలో చేరితే, మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా షర్మిల పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







