ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ హెచ్చరిక!
- March 27, 2021
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమాన ప్రయాణికులను హెచ్చరించారు. కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని 'నో-ఫ్లై' జాబితాలో చేర్చాలని విమానాశ్రయ అధికారులకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనాపై పోరులో మనం చాలా సులువుగా గెలవగలం.కానీ, కొందరు ప్రయాణికులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం సమస్యలను సృష్టిస్తోంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు ఆదేశాలు ఇవ్వబడ్డాయి.అని మంత్రి అన్నారు. "కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేశాం.కానీ, కొందరు ప్రయాణికులు వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు.ఇకపై అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. కరోనా మార్గదర్శకాలను పాటించని ప్రయాణికులను 'నో-ఫ్లై' జాబితాలో చేర్చాలని నిర్ణయించాం" అని హర్దీప్ సింగ్ పూరి చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







