ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ హెచ్చరిక!
- March 27, 2021
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమాన ప్రయాణికులను హెచ్చరించారు. కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని 'నో-ఫ్లై' జాబితాలో చేర్చాలని విమానాశ్రయ అధికారులకు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనాపై పోరులో మనం చాలా సులువుగా గెలవగలం.కానీ, కొందరు ప్రయాణికులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం సమస్యలను సృష్టిస్తోంది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు ఆదేశాలు ఇవ్వబడ్డాయి.అని మంత్రి అన్నారు. "కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేశాం.కానీ, కొందరు ప్రయాణికులు వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు.ఇకపై అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. కరోనా మార్గదర్శకాలను పాటించని ప్రయాణికులను 'నో-ఫ్లై' జాబితాలో చేర్చాలని నిర్ణయించాం" అని హర్దీప్ సింగ్ పూరి చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







