పేద దేశాలకు కోటి డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి:టెడ్రోస్
- March 27, 2021జెనీవా:సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు.2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.ఈ సందర్భంగా టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ.. పేద దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన కొవాక్స్ పథకాన్ని ప్రారంభించిందని, దీనికి టీకాల సరఫరా సమస్యల కారణంగా జాప్యం జరుగుతుందన్నారు. అయితే 36 దేశాల్లో ప్రజలకు ఇచ్చేందుకు ఒక్క డోసు కూడా అందలేదని, రాబోయే రెండు వారాల్లో 16 దేశాలకు మొదటి డోసు అందనుందని తెలిపారు. మిగతా 20 దేశాలకు వ్యాక్సిన్లు అవసరమని, సంపన్న దేశాలు వ్యాక్సిన్ను విరాళంగా అందజేస్తే రాబోయే రెండు వారాల్లో ఆయా దేశాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు టీకాలు వేయవచ్చని టెడ్రోస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ