పేద దేశాలకు కోటి డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి:టెడ్రోస్
- March 27, 2021జెనీవా:సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు.2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.ఈ సందర్భంగా టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ.. పేద దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన కొవాక్స్ పథకాన్ని ప్రారంభించిందని, దీనికి టీకాల సరఫరా సమస్యల కారణంగా జాప్యం జరుగుతుందన్నారు. అయితే 36 దేశాల్లో ప్రజలకు ఇచ్చేందుకు ఒక్క డోసు కూడా అందలేదని, రాబోయే రెండు వారాల్లో 16 దేశాలకు మొదటి డోసు అందనుందని తెలిపారు. మిగతా 20 దేశాలకు వ్యాక్సిన్లు అవసరమని, సంపన్న దేశాలు వ్యాక్సిన్ను విరాళంగా అందజేస్తే రాబోయే రెండు వారాల్లో ఆయా దేశాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు టీకాలు వేయవచ్చని టెడ్రోస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!