భారత్ కరోనా అప్డేట్...

- March 28, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్...

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కేసులు భారీగా పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.ఇక కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి.మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో  భారత్ లో కొత్తగా 62,714 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో  భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కి చేరింది.ఇందులో 1,13,23,762 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,86,310 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో  భారత్ లో 312 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో  భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,61,552కి చేరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com