పబ్లిక్ ఉద్యోగాలు కేవలం సిటిజెన్స్కి మాత్రమే: ఎంపీలు
- February 29, 2016వలసదారులెవరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం దక్కించుకోలేరని ఎంపీలు స్పష్టం చేశారు. పబ్లిక్ సెక్టార్లో బహ్రెయినీలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే దిశగా ఓ ప్రపోజల్ని ఎంపీ జమీలా అల్ సమ్మక్ మరియు మరో నలుగురు ఎంపీలు అందజేశారు. నెల రోజుల క్రితమే ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న 50 శాతం మంది నాన్ బహ్రెయినీలకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోగా, దాని తర్వాత బహ్రెయినీ పౌరుల కోసం తీసుకున్న తాజా చర్యగా దీనిని అభివర్ణించవచ్చు. బహ్రెయినీలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగావకాశాల్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలో ఇది కూడా ఓ భాగమని ఎంపీలు చెప్పారు. గడచిన మూడేళ్ళలో సుమారు 2500 మంది వలసదారులు బహ్రెయిన్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. వారందర్నీ వెనక్కి పంపి, వారి స్థాయిలో బహ్రెయినీలకు అవకాశం కల్పించాల్సి ఉందని ఎంపీ ఖాదీమ్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నాన్ బహ్రెయినీలకు అవకాశం కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఓ ఉద్యోగానికి బహ్రెయినీ యువకులెవరూ పోటీ లేనప్పుడే వలసదారులకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







