పబ్లిక్ ఉద్యోగాలు కేవలం సిటిజెన్స్కి మాత్రమే: ఎంపీలు
- February 29, 2016వలసదారులెవరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం దక్కించుకోలేరని ఎంపీలు స్పష్టం చేశారు. పబ్లిక్ సెక్టార్లో బహ్రెయినీలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే దిశగా ఓ ప్రపోజల్ని ఎంపీ జమీలా అల్ సమ్మక్ మరియు మరో నలుగురు ఎంపీలు అందజేశారు. నెల రోజుల క్రితమే ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న 50 శాతం మంది నాన్ బహ్రెయినీలకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోగా, దాని తర్వాత బహ్రెయినీ పౌరుల కోసం తీసుకున్న తాజా చర్యగా దీనిని అభివర్ణించవచ్చు. బహ్రెయినీలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగావకాశాల్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలో ఇది కూడా ఓ భాగమని ఎంపీలు చెప్పారు. గడచిన మూడేళ్ళలో సుమారు 2500 మంది వలసదారులు బహ్రెయిన్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. వారందర్నీ వెనక్కి పంపి, వారి స్థాయిలో బహ్రెయినీలకు అవకాశం కల్పించాల్సి ఉందని ఎంపీ ఖాదీమ్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నాన్ బహ్రెయినీలకు అవకాశం కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఓ ఉద్యోగానికి బహ్రెయినీ యువకులెవరూ పోటీ లేనప్పుడే వలసదారులకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..