సెంటర్ పాయింట్ నుంచి 25 ఔట్లెట్స్
- February 29, 2016
ల్యాండ్ మూర్క్ గ్రూప్కి చెందిన నాలుగు ఫ్యాషన్ బ్రాండ్స్ని కలిగి ఉన్న సెంటర్ పాయింట్ అతి త్వరలో 25 కొత్త ఔట్లెట్స్ని ప్రారంభించనుంది. దీనికోసం 2500 మంది ఉద్యోగుల్ని నియమించాలని భావిస్తోంది. గల్ఫ్ రీజియన్లో 25 ఔట్లెట్స్ని ఏర్పాటు చేయనున్నామనీ, వీటిల్లో చాలావరకు సౌదీ అరేబియా, ఒమన్ మరియు కువైట్లలో ఏర్పాటు చేస్తామనీ, వచ్చే ఏడాది ఖతార్లో ఎక్కువ ఔట్లెట్స్ ప్రారంభిస్తామని అన్నారు. జిసిసిలోని చాలా షాపింగ్ మాల్స్ డెవలప్మెంట్లో తమ పాత్ర ఎంతో కీలకంగా ఉందని సెంటర్ పాయింట్ హెడ్ సైమన్ కూపర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 128 ఔట్లెట్స్లో సగానికి పైగా స్టాండ్ అలోన్ కాగా, మరికొన్ని షాపింగ్ మాల్స్లో ఉన్నాయి. ప్రతీ స్టోర్ ద్వారా 100కి పైగా ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







