పబ్లిక్ ఉద్యోగాలు కేవలం సిటిజెన్స్కి మాత్రమే: ఎంపీలు
- February 29, 2016వలసదారులెవరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం దక్కించుకోలేరని ఎంపీలు స్పష్టం చేశారు. పబ్లిక్ సెక్టార్లో బహ్రెయినీలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే దిశగా ఓ ప్రపోజల్ని ఎంపీ జమీలా అల్ సమ్మక్ మరియు మరో నలుగురు ఎంపీలు అందజేశారు. నెల రోజుల క్రితమే ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న 50 శాతం మంది నాన్ బహ్రెయినీలకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోగా, దాని తర్వాత బహ్రెయినీ పౌరుల కోసం తీసుకున్న తాజా చర్యగా దీనిని అభివర్ణించవచ్చు. బహ్రెయినీలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగావకాశాల్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలో ఇది కూడా ఓ భాగమని ఎంపీలు చెప్పారు. గడచిన మూడేళ్ళలో సుమారు 2500 మంది వలసదారులు బహ్రెయిన్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. వారందర్నీ వెనక్కి పంపి, వారి స్థాయిలో బహ్రెయినీలకు అవకాశం కల్పించాల్సి ఉందని ఎంపీ ఖాదీమ్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నాన్ బహ్రెయినీలకు అవకాశం కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఓ ఉద్యోగానికి బహ్రెయినీ యువకులెవరూ పోటీ లేనప్పుడే వలసదారులకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం