హాస్పిటల్లో అక్షయ్ కుమార్
- April 05, 2021బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొవిడ్తో హాస్పిటల్లో చేరాడు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు చెప్పిన అతడు.. డాక్టర్ల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం మరో ట్వీట్ చేశాడు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ ప్రార్థనలు పని చేస్తున్నాయి. నేను బాగానే ఉన్నాను. అయితే ముందు జాగ్రత్తగా డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అని అక్షయ్ ట్వీట్ చేశాడు.
మరోవైపు అక్షయ్ నటిస్తున్న రామ్సేతు మూవీలో ఏకంగా 45 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆమిర్ ఖాన్, ఆలియా భట్, ఫాతిమా సనా షేక్, కార్తీక్ ఆర్యన్, పరేష్ రావల్, మిలింద్ సోమన్లాంటి వాళ్లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ కరోనా మరింత ఉద్ధృతంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లోనే కేసులు లక్ష దాటాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..