ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 07, 2021అమరావతి:ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. క్రమంగా పెరుగుతూ పోతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ రెండు వేల మార్క్ను దాటేసింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,812 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,331 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఇక, కోవిడ్ బారినపడి మరో 11 మంది మృతిచెందారు.. చిత్తూరులో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. ఇక, గడచిన 24 గంటల్లో 853 మంది రికవరీ అయ్యారు. దీంతో.. ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,13,274కు చేరగా.. రికవరీ కేసులు 8,92,736కి పెరిగాయి.. ప్రస్తుతం యాక్టిక్ కేసులు 13,276గా ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 7,262 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..