తెలంగాణలో లాక్ డౌన్ పై క్లారిటీ !
- April 07, 2021హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల పేర్కొన్నారు.మహారాష్ట్ర నుంచి తెలంగాణకు పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతున్నాయని, అందువల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎక్కువ మంది అసిమ్టమాటిక్ గా ఉంటున్నారని, తెలంగాణలో వాక్సినేషన్ వేగవంతం చేసేందుకు.. ప్రతి రోజు లక్ష మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ నాన్ కోవిడ్ సేవలు అందుతాయని, ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు వ్యాపార కోణంలో కరోనా చికిత్స ను చూడొద్దని కోరారు. మాస్కులు తప్పకుండా ధరించాలని కోరిన ఆయన ఇంకా కొన్ని రోజులు సెకండ్ వేవ్ ప్రభావం ఉంటుంది అని, అయితే లాక్ డౌన్ , కర్ఫ్యూ లు ఉండవని అన్నారు. పబ్ , క్లబ్బుల్లో కరోనా జాగ్రత్తలు పాటించాలని ఈటల పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్