అనుమతి లేకుండా ఉమ్రా చేస్తే 10,000 దిర్హాముల జరీమానా
- April 09, 2021యూఏఈ: రమదాన్ సందర్భంగా అనుమతి లేకుండా ఉమ్రా ప్రార్థనలు నిర్వహిస్తే 10,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు సౌదీ అరేబియా అథారిటీస్ వెల్లడించాయి. అనుమతి లేకుండా మక్కాలోని గ్రాండ్ మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, వారికి అదనంగా 1,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రాండ్ మసీదు సామర్థ్యానికి అనుగుణంగా, కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు రమదాన్ సందర్భంగా. సెక్యూరిటీ కంట్రోల్ కేంద్రాలు, రోడ్లు.. గ్రాండ్ మసీదు వైపుగా వెళ్ళే అన్ని ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ సిబ్బంది పెట్రోల్ నిర్వహించడం జరుగుతుంది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్రా మరియు తవకల్నా యాప్స్ అప్-డేట్ చేయడం జరిగిందని పేర్కొన్నాయి. సౌదీ అథారిటీ ఫర్ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారీ వీటిని మెరుగ్గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్