అనుమతి లేకుండా ఉమ్రా చేస్తే 10,000 దిర్హాముల జరీమానా
- April 09, 2021
యూఏఈ: రమదాన్ సందర్భంగా అనుమతి లేకుండా ఉమ్రా ప్రార్థనలు నిర్వహిస్తే 10,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు సౌదీ అరేబియా అథారిటీస్ వెల్లడించాయి. అనుమతి లేకుండా మక్కాలోని గ్రాండ్ మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, వారికి అదనంగా 1,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రాండ్ మసీదు సామర్థ్యానికి అనుగుణంగా, కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు రమదాన్ సందర్భంగా. సెక్యూరిటీ కంట్రోల్ కేంద్రాలు, రోడ్లు.. గ్రాండ్ మసీదు వైపుగా వెళ్ళే అన్ని ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ సిబ్బంది పెట్రోల్ నిర్వహించడం జరుగుతుంది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్రా మరియు తవకల్నా యాప్స్ అప్-డేట్ చేయడం జరిగిందని పేర్కొన్నాయి. సౌదీ అథారిటీ ఫర్ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారీ వీటిని మెరుగ్గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







