అనుమతి లేకుండా ఉమ్రా చేస్తే 10,000 దిర్హాముల జరీమానా
- April 09, 2021యూఏఈ: రమదాన్ సందర్భంగా అనుమతి లేకుండా ఉమ్రా ప్రార్థనలు నిర్వహిస్తే 10,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు సౌదీ అరేబియా అథారిటీస్ వెల్లడించాయి. అనుమతి లేకుండా మక్కాలోని గ్రాండ్ మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, వారికి అదనంగా 1,000 దిర్హాముల జరీమానా విధించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రాండ్ మసీదు సామర్థ్యానికి అనుగుణంగా, కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు రమదాన్ సందర్భంగా. సెక్యూరిటీ కంట్రోల్ కేంద్రాలు, రోడ్లు.. గ్రాండ్ మసీదు వైపుగా వెళ్ళే అన్ని ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ సిబ్బంది పెట్రోల్ నిర్వహించడం జరుగుతుంది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్రా మరియు తవకల్నా యాప్స్ అప్-డేట్ చేయడం జరిగిందని పేర్కొన్నాయి. సౌదీ అథారిటీ ఫర్ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారీ వీటిని మెరుగ్గా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు