మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు..
- April 10, 2021
ముంబై: కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు మహారాష్ట్ర లో కలకలం సృష్టిస్తోంది.భారత్లో రోజుకో రికార్డు తరహాలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. వాటిలో మెజార్టీగా మహారాష్ట్రలో నమోదు అవుతున్న కేసులే ఉంటున్నాయి.కరోనా ఫస్ట్ వేవ్లో నమోదైన పాజిటివ్ కేసుల రికార్డును..సెకండ్ వేవ్ ఎప్పుడో దాటేసింది.దీంతో.. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు, నైట్ కర్ఫ్యూ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, ఇప్పుడు సంపూర్ణ లాక్ డౌన్ తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే.. లాక్డౌన్ విధించడం మినహా వేరే గత్యంతరం లేదని, ఇతర మార్గాలు కూడా కనిపించడం లేదని.. ఇవాళ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.. ఇక, నెల పాటు లాక్డౌన్ విధిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని..దీనికి మీరంతా సహకరించాలని ఆయన రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు.ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన థాకరే.. లాక్డౌన్ విధించడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!









