స్పుత్నిక్-వీ టీకా దిగుమతికి కసరత్తు..ధరపై ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ చర్చలు
- April 15, 2021
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో అత్యవసర వినియోగం కోసం రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ను దిగుమతి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (డీఆర్ఎల్) కసరత్తు చేస్తున్నది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది. అంతా సవ్యంగా జరిగితే జూన్లోగా భారత్కు ఈ టీకా అందే అవకాశమున్నది. అయితే భారత్ కొనుగోలు చేసే డోసుల సంఖ్య, వాటిని ప్రజలకు పంపిణీ చేసేందుకు స్థానికంగా అందుబాటులో ఉన్న కోల్డ్ చైన్ వ్యవస్థ సామర్థ్యం లాంటి అంశాలపై ఈ టీకా లభ్యత ఆధారపడి ఉంటుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో కుదుర్చుకు న్న ఒప్పందం ప్రకారం తమకు దాదాపు 25 కోట్ల స్పుత్నిక్-వీ డోసులు రావచ్చని, ఇవి 12.5 కోట్ల మందికి సరిపోతాయని డీఆర్ఎల్ యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియంట్స్ (ఏపీఐ), సేవల విభాగం సీఈవో వీ దీపక్ సప్రా బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ టీకా ధరపై ఆర్డీఐఎఫ్తో చర్చలు జరుపు తున్నామని, అవసరమైతే ఆ సంస్థతో పరస్పర అంగీకారాన్ని కుదుర్చుకుని మరిన్ని డోసులను కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









