యూఏఈలో భారత్-పాక్ విదేశాంగ మంత్రులు..సంధి సంకేతాలు
- April 18, 2021
అబుధాబి: భారత్- పాక్ మధ్య సంధి ప్రయత్నాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంకేతాలకు మద్దతుగా యూఏఈలో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అహ్వానం మేరకు భారత్- పాక్ విదేశాంగ మంత్రులు యూఏఈలో పర్యటించనున్నారు.ఈ పర్యటన కోసం పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషి ఇప్పటికే యూఏఈకి చేరుకోగా...భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆదివారం రోజున యూఏఈకి చేరుకుంటారు. ఈ ఇద్దరు మంత్రులు యూఏఈ విదేశాంగ మంత్రితో సమావేశం అవుతారు.పొరుగు దేశాలైన భారత్- పాక్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు యూఏఈ మధ్యవర్తిత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికాలో యూఏఈ రాయబారి యూసఫ్ అల్ ఒటైబా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే...ఈ రోజు సమావేశంతో అద్భుతాలను ఆశించలేమని...కాకపోతే సంధి దిశగా తొలి అడుగులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







