యూఏఈలో భారత్-పాక్ విదేశాంగ మంత్రులు..సంధి సంకేతాలు
- April 18, 2021
అబుధాబి: భారత్- పాక్ మధ్య సంధి ప్రయత్నాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంకేతాలకు మద్దతుగా యూఏఈలో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అహ్వానం మేరకు భారత్- పాక్ విదేశాంగ మంత్రులు యూఏఈలో పర్యటించనున్నారు.ఈ పర్యటన కోసం పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషి ఇప్పటికే యూఏఈకి చేరుకోగా...భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆదివారం రోజున యూఏఈకి చేరుకుంటారు. ఈ ఇద్దరు మంత్రులు యూఏఈ విదేశాంగ మంత్రితో సమావేశం అవుతారు.పొరుగు దేశాలైన భారత్- పాక్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు యూఏఈ మధ్యవర్తిత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికాలో యూఏఈ రాయబారి యూసఫ్ అల్ ఒటైబా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే...ఈ రోజు సమావేశంతో అద్భుతాలను ఆశించలేమని...కాకపోతే సంధి దిశగా తొలి అడుగులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









