క్షీణించిన వైఎస్ షర్మిల ఆరోగ్యం..
- April 18, 2021
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని కోరుతూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ 15 వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షకు కూర్చున్నారు.అయితే, సాయంత్రం తరువాత పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వైఎస్ షర్మిలను లోటస్ పాండ్ లోని తన ఇంటికి చేర్చడంతో అక్కడే ఆమె దీక్షకు దిగారు.ప్రస్తుతం ఇంట్లో నుంచే షర్మిల దీక్ష చేస్తున్నారు.అయితే తాజాగా వైద్యులు షర్మిల ఆరోగ్యాన్ని పరీక్షించారు. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా షర్మిల ఆరోగ్యంపై డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. షర్మిల ఆరోగ్యం క్షిణిస్తోందని పేర్కొన్నారు.షర్మిల షుగర్ లెవెల్స్ 88 నుంచి 62 కు తగ్గాయని వెల్లడించారు. అంతేకాదు షర్మిల ఏకంగా రెండు కిలోల బరువు తగ్గారని డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆమె బిపి కూడా కంట్రోల్ తప్పిందని ఆయన పేర్కొన్నారు.కాగా ఇవాళ మధ్యాహ్నం లోపు ఆమె దీక్ష విరమించుతారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







