రెసిపిరేటర్స్ కొరత ప్రచారాలను కొట్టిపారేసిన ఒమన్
- April 18, 2021
ఒమన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు అందించే రెసిపిరేటర్స్ కు కొరత ఏర్పడిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. పేషెంట్లకు కావాల్సిన స్థాయిలో రెసిపిరేటర్స్ ఉన్నాయని స్పష్టత ఇచ్చింది. సలాలలోని కబూస్ ఆస్పత్రిలో రెసిపిరేటర్స్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పేషెంట్లకు తగిన చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆస్పత్రుల్లో అందుకు కావాల్సిన వసతులను పెంచామని కూడా వివరించింది. ప్రజలు ఎవరూ ఊహాగానాలను విశ్వసించొద్దని, సంబంధిత శాఖ నుంచి కావాల్సిన సమాచారాన్ని పొందాలని సూచించింది. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









