రెసిపిరేటర్స్ కొరత ప్రచారాలను కొట్టిపారేసిన ఒమన్
- April 18, 2021
ఒమన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు అందించే రెసిపిరేటర్స్ కు కొరత ఏర్పడిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. పేషెంట్లకు కావాల్సిన స్థాయిలో రెసిపిరేటర్స్ ఉన్నాయని స్పష్టత ఇచ్చింది. సలాలలోని కబూస్ ఆస్పత్రిలో రెసిపిరేటర్స్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పేషెంట్లకు తగిన చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆస్పత్రుల్లో అందుకు కావాల్సిన వసతులను పెంచామని కూడా వివరించింది. ప్రజలు ఎవరూ ఊహాగానాలను విశ్వసించొద్దని, సంబంధిత శాఖ నుంచి కావాల్సిన సమాచారాన్ని పొందాలని సూచించింది. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







