గల్ఫ్ మృతుడికి బంధువుల ఊరిలో అంత్యక్రియలు
- April 18, 2021
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ కు చెందిన నలిమెల జెశ్వంత్ రెడ్డి (29) ఇటీవల బహరేన్ లో గుండెపోటుతో మృతి చెందాడు. అతని శవపేటిక ఆదివారం ఎయిర్ ఇండియా విమానంలో బహరేన్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నది. ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం వారు హైదరాబాద్ విమానాశ్రయం నుండి శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.మృతుడు జెశ్వంత్ రెడ్డి కుటుంబం నిజామాబాద్ లో కిరాయి ఇంట్లో ఉంటున్నందున అతని మేనత్త నివసించే ఆర్మూర్ మండలం మంథని గ్రామం లో అంత్యక్రియలు నిర్వహించాలని బంధువర్గం నిర్ణయించింది.
మృతుని తండ్రి చాలా ఏళ్ల క్రితం ప్రమాదంలో గాయపడి అచేతనంగా ఉండటం వలన స్వగ్రామం ఆలూరు లోని ఆస్తులు అమ్ముకొని నిజామాబాద్ లో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఇటీవలే బహరేన్ కు వెళ్లిన జెశ్వంత్ రెడ్డి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో అతనిపై ఆధారపడ్డ తండ్రి రాంరెడ్డి, తల్లి దివ్య, చెల్లెలు నిఖిల దిక్కులేని వారయ్యారు.

కరోనా ఆంక్షలు, రంజాన్ సందర్బంగా కుదించిన పనివేళలు ఉన్నప్పటికీ శ్రమకోర్చి మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి బహరేన్ లోని తెలంగాణ సామాజిక సేవకులు తిర్మన్ పల్లి శేఖర్, ఎపి ఎన్నార్టి కోఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వర్ రావు, తెలుగు కళా సమితి అధ్యక్షులు శివ ఎల్లపు, మురళి నోముల బృందం సహకరించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







