మహారాష్ట్రలో కోవిడ్ విజృంభణ

- April 18, 2021 , by Maagulf
మహారాష్ట్రలో కోవిడ్ విజృంభణ

ముంబై: భారత దేశంలో కోవిడ్ రోజు రోజుకీ విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ రూపంలో ప్ర‌మాదం ఎక్కువ‌వుతోంది.ఇప్ప‌టికే రోజు వారీ కోవిడ్ కేసుల సంఖ్య 2 ల‌క్ష‌ల‌ను దాటింది.దీంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ క‌ట్ట‌డికి అనేక చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. 
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కోవిడ్ విలయతాండవం చేస్తోంది. ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 68,631 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 503 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో కోవిడ్ వల్ల మొత్తం 60,473 మంది మృతి చెందారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,70,388 మంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com