ఫైర్ సర్వీసెస్ సేవలు త్యాగ పూరితమైనవి: టి.హోం మంత్రి
- April 18, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డిసాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సేవలు త్యాగ పూరితమైనవని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం నాడు ఫైర్ సర్వీసెస్ శాఖ ఆధ్వర్యంలో "తెలంగాణ ఫైర్ రైడ్ 2021 " జరిగింది. సంజయ్ కుమార్ జైన్, డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీసెస్, లక్ష్మి ప్రసాద్, డైరెక్టర్, నారాయణ్ రావు, అడిషనల్ డెరైక్టర్, పాపయ్య, ఆర్ ఎఫ్ ఓ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ....ఎన్నో అగ్ని ప్రమాదాల నుండి ఈ శాఖలో పని చేస్తున్న సిబ్బంది సామాన్య ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడారని హోం మంత్రి ప్రశంసించారు.అగ్నిమాపక సేవలందిస్తున్న ఈ శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందని, అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా సైకిల్తన్ నిర్వహించడం అభినందనీయమన్నారు.ఏప్రిల్ 14, 1944 న గ్రేట్ బ్రిటన్ నేవీ యొక్క యుద్ధనౌకలో బొంబాయి నౌకాశ్రయంలో మంటలు చెలరేగడంతో, 66 మంది అధికారులు మరియు అగ్నిమాపక సిబ్బంది మరణించారని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 న అగ్నిమాపక సేవల దినోత్సవాన్ని జరుపు కుంటున్నామని గుర్తుచేశారు.ఈ వారోత్సవాలు ఏప్రిల్ 14 న ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు కొనసాగుతున్నయని తెలియజేశారు. వారోత్సవాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అగ్నిమాపక సేవల వారోత్సవాలు సాధారణ ప్రజలలో భద్రత గురించి అవగాహన పెంచుతాయన్నారు. స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా అతిపెద్ద సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ప్రజలు అగ్నిమాపక సేవల సర్వీసెస్ తో మంచి సంబంధాలు పెట్టుకోవడం చాలా ముఖ్యం అని హోంమంత్రి అన్నారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడటానికి ముందు రాష్ట్రంలో కేవలం 97 అగ్నిమాపక కేంద్రాలు మాత్రమే ఉన్నాయి.తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తక్కువ వ్యవధిలో 20 కి పైగా అగ్నిమాపక కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం అగ్నిమాపక సేవల విభాగం యొక్క శిక్షణా సౌకర్యాలను మెరుగుపరిచి, ఆధునీకరించిందని చెప్పారు. అన్ని అగ్నిమాపక కేంద్రాలకు కొత్త ఫైర్ మోటార్సైకిళ్లను అందించారని తెలిపారు.ఈ వాహనాల సహాయంతో ప్రమాద స్థలాన్ని వెంటనే చేరుకొని ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో శాఖా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







