ఏపీలో రాత్రి కర్వ్ఫూ పై క్లారిటీ
- April 19, 2021
అమరావతి: అమరావతిలో కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరిగింది. నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ముందు నుండి ప్రచారం జరిగింది. పదవ తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.రాత్రి కర్వ్ఫూ ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నా అదేమీ లేదని ఆళ్ళ నాని కొట్టి పారేసారు.ఇక ఇంటర్ పరీక్షలు వాయిదా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.స్కూళ్లకు శెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉందని, దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షల అవకాశం ఉందని అంటున్నారు.ఇక బార్లు, రెస్టారెంట్ల పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం ఆంక్షలు పెట్టే ఆలోచనలో ఉందని అంటున్నారు. వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టి వాలంటీర్లతో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.ఒక అరగంట గ్యాప్ తర్వాత మీటింగ్ మళ్ళీ మొదలయింది.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









