రాజస్థాన్లో 15 రోజుల లాక్డౌన్..!
- April 19, 2021
జైపూర్: ఢిల్లీ బాటలోనే ఇప్పుడు రాజస్థాన్లో కూడా లాక్డౌన్ విధించారు.ఢిల్లీలో 6 రోజులు లాక్డౌన్ విధిస్తే రాజస్థాన్లో 15 రోజులు లాక్డౌన్ అమలు చేయబోతున్నారు. ఇవాళ్టి నుంచి మే 3 వరకూ లాక్డౌన్ అమల్లోకి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కోవిడ్ నిబంధనలు విడుదల చేసిన రాజస్థాన్ సర్కార్.. లాక్డౌన్ ఉన్నా నిత్యావసరాల దుకాణాలకు మాత్రం సాయంత్రం 5 గంటల వరకూ అనుమతి ఇచ్చింది. అలాగే కూరగాయల వ్యాపారులకు 7 గంటల వరకూ.. పెట్రోల్ బంక్లకు 8 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు వీలుంటుంది. అటు, ప్రజారవాణాకు షరతులతో అనుమతులు ఇచ్చినా..... విద్యాసంస్థలు, పరిశ్రమలు మాత్రం పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో నియంత్రణకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పడం లేదని రాజస్థాన్ ప్రభుత్వం చెప్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









