భారత్ కరోనా అప్డేట్

- April 20, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది.కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.ప్రతిరోజూ రెండున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 2,59,170 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కి చేరింది.ఇందులో 1,31,08,582 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 20,31,977 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 1,54,761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 1,761 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,80,530కి చేరింది.ఇక ఇదిలా ఉంటె భారత్ లో ఇప్పటి వరకు దేశంలో 12,71,29,113కి చేరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com