మహిళ హత్యకు నిరసనగా ఆందోళన
- April 23, 2021కువైట్: అల్ ఎరాడా స్క్వేర్ వద్ద పలువురు నిరసనకారులు న్యాయం కోసం ఆందోళన బాట పట్టారు. వివరాల్లోకి వెళితే, ఫరా అక్తర్ అనే మహిళను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు, ఆమెతో పెళ్ళికి అంగీకరించలేదన్న కారణంగా నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన వెంటనే విడుదల చేసేశారంటూ పలువురు ఆందోళనకారులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ప్రత్యేక చట్టం ద్వారా ఇలాంటి కేసుల్లో దోషుల్ని శక్షించాల్సి వుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..