భారత్ సెకండ్ వేవ్: 'స్ట్రైక్ టీం' ను రంగంలోకి దింపుతున్న పెద్దన్న
- April 27, 2021
సొంత పార్టీ నేతల పాటు ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో భారత్ కు సాయం చేసే విషయంపై అమెరికా మెట్టు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఫోన్ లో మాట్లాడారు. తాజాగా అమెరికా ఎలాంటి సాయం చేయబోతోందన్న దానిపై మంగళవారం వైట్ హౌస్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా ‘స్ట్రైక్ టీం’ను ఇండియాకు పంపిస్తున్నట్టు చెప్పారు.
ఆ బృందంలోప్రజారోగ్య నిపుణులు ఉంటారని శ్వేత సౌధపు అధికారి చెప్పారు. స్ట్రైక్ టీంను ఇండియాకు పంపించడం కోసం యూఎస్ఏఐడీ, అమెరికా సీడీసీ సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. భారత ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి పనిచేసేందుకు ఇప్పటికే తమ ఎంబసీ అధికారులను సంప్రదించినట్టు చెప్పారు.
లేబొరేటరీ సేవలు, నిఘా, ఎపిడెమియాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణ, వ్యాధి కరోనాతో కకావికలం.. ఇండియాలో దిగననున్న అమెరికా ‘‘ స్ట్రైక్ టీం’’ సాయపడగలదని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.
భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్.. కొవిషీల్డ్ ఉత్పత్తి కోసం తగినంత ముడిసరుకును ఎగుమతి చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న భయానక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలు ఇచ్చేందుకు, ఆక్సిజన్ సరఫరా చైన్ అభివృద్ధి కోసం ఇప్పటికేఅమెరికా రక్షణ శాఖ, యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ లు పనిచేస్తున్నాయన్నారు.
ఆక్సిజన్ సిలిండర్ల కాంట్రాక్ట్ కు సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకుందని ఆఅధికారి పేర్కొన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లూ ఇచ్చే విషయంపైనా చర్చిస్తున్నట్లు తెలిపారు. భారత్ కోరిన అన్ని విభాగాల్లోనూ సిబ్బందికి శిక్షణనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక కరోనా చికిత్సలో కీలకమైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను త్వరితగతిన పంపుతామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







