డబల్ బెడ్ రూం ఇండ్ల దరకాస్తు చేసుకోవడం ఎలా?
- March 03, 2016
ఇల్లు లేని నిరుపేదల కోసం, వారి ఆత్మగౌరవం కోసం ప్రవేశపెట్టిన పథకం అయినందున నిజమైన లబ్ధిదారులకే లబ్ది చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
* అర్హత ఉన్నవారు స్థానిక మీసేవా కేంద్రాల్లో సంప్రదించాలి.
* అక్కడ దరఖాస్తు ఫారాన్ని తీసుకుని, పూర్తి వివరాలతో నింపాలి.
* ఫారానికి పాస్పోర్టుసైజ్ ఫొటోతోపాటు, ఆధార్, ఫుడ్సెక్యూరిటీ కార్డు జిరాక్సులను జతపర్చాలి.
* కుటుంబ సభ్యుల ఆధార్కార్డు ఉంటే మంచింది.
* ప్రస్తుత అడ్రస్లో ప్లాట్నెంబర్ కాకుండా ఇంటి నెంబర్ ఉండేలా చూసుకోవాలి.
* మండలం, గ్రామం, కాలనీ, డివిజన్, ల్యాండ్మార్క్, లొకాలిటీ వంటి అంశాలను తప్పనిసరిగా పేర్కొనాలి.
* దరఖాస్తు దారుడి ఆధార్ నెంబర్, వయస్సు, సంవత్సర ఆదాయం, సెల్ నెంబర్లను కూడా తెలియపర్చాలి.
* గతంలో ప్రభుత్వ ఆసరా పెన్షన్, ఇళ్లు పొందినవారైతే స్పష్టంగా వివరాలను తెలపాలి.
* మొబైల్ నెంబర్, ఉంటే ఈమేయిల్ ఐడీలను పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇలా అన్ని వివరాలతో కూడిన ఫారాన్ని మీ సేవా కేంద్రాల్లో ఇస్తే, సదరు నిర్వాహకులు పరిశీలించి ఆన్లైన్లో దరఖాస్తు ఫారం, ఫొటోలను అప్లోడ్ చేసి, మిగతా వివరాలను నింపుతారు. అనంతరం చెల్లిపు రశీదును అందించినప్పుడు రూ.25ను చెల్లించాల్సి ఉంటుంది. దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







