భారత్ కు బాసటగా నిలిచిన బాప్స్ హిందూ మందిర్
- April 29, 2021
అబుధాబి: కోవిడ్ తో ప్రపంచ దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ మరింత జఠిలంగా మారుతుండటంతో సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ లో వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోందని...ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు తమ మాతృదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని అబుధాబి బాప్స్ హిందూ మందిర్ చైర్మన్ స్వామి బ్రహ్మవిహారిదాస్ పిలుపునిచ్చారు. కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొవటంలో భారత్ కు పూర్తి మద్దతుగా నిలబడతామని యూఏఈ ప్రకటించిన విషయం తెలిసిందే. యూఏఈ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడి ప్రవాస భారతీయులు కూడా మాతృదేశానికి సాయం చేసేందుకు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ వంతుగా బాప్స్ హిందూ మందిర్ తరపున భారత్ కు నెలకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం, బాప్స్ నిర్వహణలో ఉన్న కోవిడ్ ఆస్పత్రుల ద్వారా నిరుపేదలు లబ్ధిపొందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. తమ లక్ష్యానికి అనుగుణంగా తొలి వారం 44 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్, 600 ఆక్సిజన్ సిలండర్లు పంపిస్తున్నట్లు వివరించారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సహకారంతో విమాన, పడవల ద్వారా భారత్ కు ఆక్సిజన్ పంపిస్తున్నట్లు స్వామి వెల్లడించారు.
తాజా వార్తలు
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ









