భారత్ కు బాసటగా నిలిచిన బాప్స్ హిందూ మందిర్
- April 29, 2021
అబుధాబి: కోవిడ్ తో ప్రపంచ దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ మరింత జఠిలంగా మారుతుండటంతో సెకండ్ వేవ్ ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ లో వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోందని...ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు తమ మాతృదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని అబుధాబి బాప్స్ హిందూ మందిర్ చైర్మన్ స్వామి బ్రహ్మవిహారిదాస్ పిలుపునిచ్చారు. కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొవటంలో భారత్ కు పూర్తి మద్దతుగా నిలబడతామని యూఏఈ ప్రకటించిన విషయం తెలిసిందే. యూఏఈ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడి ప్రవాస భారతీయులు కూడా మాతృదేశానికి సాయం చేసేందుకు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ వంతుగా బాప్స్ హిందూ మందిర్ తరపున భారత్ కు నెలకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం, బాప్స్ నిర్వహణలో ఉన్న కోవిడ్ ఆస్పత్రుల ద్వారా నిరుపేదలు లబ్ధిపొందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. తమ లక్ష్యానికి అనుగుణంగా తొలి వారం 44 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్, 600 ఆక్సిజన్ సిలండర్లు పంపిస్తున్నట్లు వివరించారు. ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ సహకారంతో విమాన, పడవల ద్వారా భారత్ కు ఆక్సిజన్ పంపిస్తున్నట్లు స్వామి వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







