భారత్ లోని అమెరికన్లను వెనక్కు వచ్చేయండి అంటూ హెచ్చరిస్తున్న అగ్రరాజ్యం..
- April 29, 2021భారత్పై కరోనా విరుచుకుపడుతున్నది. ప్రతిరోజు మూడు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అక్కడ దవాఖానలు నిండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పౌరులెవరూ భారత్ వెళ్లకండి. అక్కడ ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా తిరిగి వచ్చేయండి అంటూ.. హెచ్చరించింది.
అమెరికాకు ప్రతిరోజు ఇండియా నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని, యూరప్ మీదుగా అమెరికాకు ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వాటిద్వారా స్వదేశానికి చేరుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లెవల్ ఫోర్ ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది. ఈవారం ప్రారంభంలో భారత్కు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియా నుంచి బ్రిటన్కు వచ్చేవారు తప్పనిసరిగా 10 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సిందే అని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!