ఉత్తరాఖండ్ ప్రభుత్వ కీలక నిర్ణయం..చార్ ధామ్ యాత్ర రద్దు..
- April 29, 2021కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తూ.. ప్రాణాంతకంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ నాలుగు ఆలయాల్లో కేవలం పూజారులకు మాత్రమే అనుమతి ఉందని… వారే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు. మే 14 నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో కూడా కుంభమేళాను నిర్వహించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. గురువారం ప్రత్యేకంగా సమావేశమై చార్ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. కుంభమేళా కారణంగా ఉత్తరాఖండ్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 1న 2200 కేసులు రాష్ట్రంలో ఉండగా.. అవికాస్తా బుధవారం నాటికి 45 వేలకుపైగా కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!